Tuesday, September 17, 2024

WGL: ఏజెన్సీలో జిల్లా కలెక్టర్ పర్యటన.. ప్రభుత్వ వైద్యశాలల తనిఖీ..

నూగురు వెంకటాపురం, ఆగస్టు 16 (ప్రభ న్యూస్) : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో రోగులకు వైద్యం సక్రమంగా అందుతుందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వైద్యులు, సిబ్బంది, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల పరిధిలోని నూగురు గ్రామంలో జ్వరం కేసులు ఎక్కువగా ఉన్నాయని సమాచారం తెలుసుకున్న కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించారు. విష జ్వరాలు ప్రబలకుండా గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యకిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement