Tuesday, September 17, 2024

Mulugu: నాగారంలో జాతీయ జెండాకు అవమానం..

ములుగు : ములుగు జిల్లా మండల కేంద్రంలోని నాగారం అంగన్వాడీ కేంద్రంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించాల్సిన అంగన్వాడీ టీచర్ జాతీయ జెండాను కర్రకు కట్టి ఎగురవేయకుండా వదిలేయడంతో ఉదయం 10:30 గంటల వరకు అలాగే ఉండిపోయింది.

దానిని గమనించిన గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఆగ్రహించి స్వయంగా వారే జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాపై ఇంతటి నిర్లక్ష్యం వహించిన సంబంధిత అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement