Friday, September 13, 2024

WGL: ఆస్తి కోసం.. కన్నతండ్రిపై కూతురు దాడి..

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు వేల్పుల మల్లేష్ ను అతని చిన్న కూతురు మహేశ్వరి, దత్తత తీసుకున్న అల్లుడు లక్ష్మారెడ్డి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులతో మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ఆస్తి కోసం దాడి చేయించడంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయని స్థానికులు తెలిపారు.

స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో వేల్పుల మల్లేష్ ను భూపాలపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన తండ్రిపై తమ చెల్లి మహేశ్వరి, అతని భర్త లక్ష్మారెడ్డిలు దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు గాయపడిన మల్లేష్ పెద్ద కుమార్తె రాజేశ్వరి, అల్లుడు జగన్మోహన్ రెడ్డిలు తెలిపారు. ఈ సంఘటనపై భూపాలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement