Friday, September 20, 2024

TG: 22నుండి సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు..

హాజరు కానున్న జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు వెల్లడి
హనుమకొండ (ప్రభ న్యూస్): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 22 నుండి 24 వరకు మూడు రోజుల పాటు హనుమకొండలో జరుగనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చారిత్రక నగరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా ఈ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డీ.రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె. నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై, దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిపారు.

అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజా రెడ్డి, నేదునూరి జ్యోతి, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, ఆదరి శ్రీనివాస్, నాయకులు బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి, జక్కుల రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement