Sunday, September 22, 2024

పర్ల పల్లిలో టేకుమట్ల ఎంపీపీ, సర్పంచ్ పై దాడి… ఆసుపత్రికి తరలింపు

మొగుళ్ళపల్లి, (ప్రభ న్యూస్) : జయశంకర్ జిల్లా మొగుల్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి టేకుమట్ల ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, సర్పంచి సర్వోత్తమ్ రెడ్డి , కారోబార్ లపై గ్రామస్తులు దాడి చేశారు. పర్లపల్లి గ్రామానికి చెందిన అబ్బు రాజేందర్ రెడ్డి టేకుమట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నాడు.

అధికారుల ఒత్తిడి, నాయకుల నిర్లక్ష్యంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. అధికారులు నాయకుల నిర్లక్ష్యం వల్లే రాజేందర్ మృతి చెందాడని భావించిన బంధువులు,గ్రామస్తులు ఆగ్రహంతో శుక్రవారం రాత్రి రాజేందర్ రెడ్డి అంతక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, సర్పంచి సర్వోత్తమ్ రెడ్డి లపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం చిట్యాల ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హనుమకొండ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement