Friday, October 25, 2024

WGL | ఫారెస్ట్ సిబ్బంది పై దాడి.. ఒకరికి తీవ్రగాయాలు

మూడు డోజర్లు సీజ్
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి అటవీ ప్రాంతాన్ని పోడు చేస్తున్నారనే సమాచారంతో అటవీశాఖ భూపాలపల్లి రేంజ్ అధికారి నరేష్ సిబ్బందితో కలిసి పోడు చేసే సంఘటన స్థలానికి వెళ్లగా చెల్పూర్ బేస్ క్యాంప్ సిబ్బంది సురేష్ పై దాడి చేయగా తీవ్రగాయాలు కాగా భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు.

అటవీ ప్రాంతంలో మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి అటవీ శాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి వసంత తెలిపారు. పోడు చేసేదెవరని, దాడికి పాల్పడిన వారెవరని తమ సిబ్బంది విచారణ చేస్తున్నారు. వారిని గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని జిల్లా అటవీశాఖ అధికారి వసంత తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement