Friday, September 20, 2024

బాధితులను ఆదుకుంటాం..

మహబూబాబాద్ : బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. జిల్లాలోని ఆమనగల్లు శివారులో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదంలో 12 మంది గాయపడిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్, హస్పిటల్ సూపరింటెండెంట్‌తో మాట్లాడి గాయపడిన వారికి సత్వరమే మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయం వెంటనే అందించాలని అధికారులకు సూచించారు.కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ డోరు ఊడిపోవడంతో అందులో ఉన్నవారు కిందపడిపోయారు. దీంతో 12 మంది గాయపడ్డారు. మిరప కాయలు ఏరడానికి ఆమన్‌గల్‌ నుంచి ట్రాక్టర్‌లో కూలీలను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమన్‌గల్‌ శివారులో ట్రాక్టర్‌ డోరు ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో కూలీలు కిందపడిపోయి గాయాలపాలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement