Saturday, September 28, 2024

WGL: రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు… ఎమ్మెల్యే గండ్ర

చిట్యాల, సెప్టెంబర్ 28(ప్రభ న్యూస్) : రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య‌ నారాయణరావు హెచ్చరించారు. జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనంతరం రోగులకు అందిస్తున్న వైద్యశాల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్ డా.శ్రీకాంత్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు విభాగాలకు స్వయంగా వెళ్లి రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, చికిత్స అందజేయాలని వైద్యులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement