Tuesday, October 22, 2024

Accident – కారు – బైక్ ఢీ : ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం ..

మహబూబాబాద్ జిల్లాలో నేడు జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం చెందారు. మహబూబాబాద్ మండలం జామాండ్లపల్లి శివారు ఫారెస్ట్ అర్బన్ పార్క్ వద్ద కారు , బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement