Thursday, October 17, 2024

జలదిగ్బంధంలో గిరిజన గ్రామం

వాజేడు జులై 11 ( ప్రభ న్యూస్): ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కోయ వీరాపురం గిరిజన గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది గ్రామం చుట్టూ గోదావరి వద్దని చేరడంతో అక్కడి గిరిజనులు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది గత రెండు రోజులుగా గోదావరి వరద నీరు చుట్టూ ముట్టి ఉండడంతో కోయవీరాపురం గిరిజనులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి రవాణా సౌకర్యం లేక నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయలేని పరిస్థితిలో గిరిజనులు అల్లాడుతున్నారు ఇంత జరుగుతున్న చీకుపల్లి గ్రామ సర్పంచ్ తప్ప ఆ గ్రామ వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం లేదని అక్కడి గిరిజన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement