Saturday, September 14, 2024

Wanaparthi – దూసుకొచ్చిన డీసీఎం – ముగ్గురు సాధువులు మృతి

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాధువులపై ఓ డీసీఎం దూసుకెళ్లడంతో ముగ్గురు సాధువులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వననపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..పెబ్బేరు నుంచి కర్నూలు వైపు గుజరాత్‌కు చెందిన సాధువుల బృందం నడుచుకుంటు వెళ్తున్నది. ఇదే క్రమంలో ఓ డీసీఎం వారిని ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement