Tuesday, September 24, 2024

Vote for Note 16 న కోర్టు హాజ‌రుకండి .. రేవంత్ రెడ్డికి నాంప‌ల్లి కోర్టు తాఖీదు

హైద‌రాబాద్ – ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆక్టోబర్ 16న జరిగే విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. నేడు జరిగిన విచారణకు మత్తయ్య హాజరవ్వగా..కేసులోని ఇతర నిందితులు గైర్హాజరయ్యారు. దీతో నాంపల్లి కోర్టు సీఎం రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్‌కు సమన్లు జారీ చేసింది. వ‌చ్చే వాయిదాకు నిందితులంద‌రూ కోర్టు రావాల‌ని కోరింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement