Saturday, June 29, 2024

TS: కొండగట్టు అంజన్నను దర్శించుకుని… మొక్కులు చెల్లించిన పవన్ కళ్యాణ్

కొండగట్టు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఇవాళ జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించారు.

ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు తొలిసారి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంజన్న దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ కు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement