Friday, October 18, 2024

TG: క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తే వేటే… టీపీసీసీ చీఫ్

క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తే వేటు త‌ప్ప‌ద‌ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై ఫైర్‌ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా కీలకమ‌న్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా పని చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మనం మరింత గట్టిగా పని చేయాలని సూచించారు.

- Advertisement -

నియోజకవర్గ ఇన్‌చార్జులు భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా కీలకం అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement