Friday, October 18, 2024

Vikarabad – ఆర్టీసీ బ‌స్సు – బైక్ ఢీః ముగ్గురి దుర్మ‌ర‌ణం

పూడూర్ – ఆంధ్రప్రభ – వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. పూడూరు గేట్ వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సు – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. చంగముల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదు నుండి కర్ణాటక సేడం వెళుతున్న ఆర్టీసీ బస్సు నెంబర్ టిఎస్ 34 జ్ 0020 గల ఆర్టిసి బస్సు పూడూరు స్టేజి వద్దకు రాగానే పూడూరు మండల మేడికొండ గ్రామానికి చెందిన యువకులు స్ప్లెండర్ బైక్పై మన్నెగూడ వైపు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మేడికొండ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ 21 సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన మరో యువకుడు హర్షవర్ధన్ 15 సం”అక్కడికక్కడే మృతి చెందగా గంగుపల్లి గ్రామానికి చెందిన మరో యువకుడు ఎం ప్రవీణ్ 20 సంవత్సరాలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలు మృతి చెందినట్లు చనుగోముల్ ఎస్సై తెలిపారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement