Tuesday, September 17, 2024

Peddapalli – ఏలేటి ప్రశ్నలకు జవాబు ఇవ్వండి – కాంగ్రెస్ నేతలకు పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత డిమాండ్


పెద్దపల్లి – సివిల్ సప్లై లో అతిపెద్ద అవినీతి కుంభకోణం జరిగిందని, దానిని కప్పి పుచ్చేందుకు కాంగ్రెస్ మంత్రులు డ్రామాలు ఆడుతున్నారని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. . హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నేడు జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయకపోతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడిగిన 19 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వారు తప్పు చేశారనే నిజం తెలుసు కాబట్టి మా ప్రశ్నలకు సమాధానమివ్వకుండా వ్యక్తిగత, రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. ఒకవేళ ఎలాంటి కుంభకోణం చేయకపోతే తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ప్రజలు ముందు వారి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.

- Advertisement -

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు తెరలేపి జరిగిన కుంభకోణాన్ని బయటపడకుండా కొత్త డ్రామాకు తెర లేపారన్నారు. రైతుబిడ్డ అని చెప్పుకునే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి జగిత్యాల జిల్లాలో రైస్ మిల్లర్లు చేస్తున్న అవినీతి తెలియదా అని, రాజకీయాలలో సీనియర్ అయినటువంటి జీవన్ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న మంత్రులు గాని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం గానీ బిజెపి పార్టీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement