Saturday, October 5, 2024

RR : అనంతగిరి లోయలో బోల్తా పడ్డ వ్యాన్..

వికారాబాద్ టౌన్, అక్టోబర్ 5(ప్రభ న్యూస్) : వికారాబాద్ అనంతగిరి నంది ఘాట్లో వ్యాన్ బోల్తా పడడంతో ఇద్దరి పర్యాటకులకు, డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.. వికారాబాద్ నుండి తాండూరు వెళ్తున్న ట్రాన్స్ పోర్టు డీసీఎం కిరెల్లి ఘాట్ దిగుతున్న సమయంలో వాహనం అదుపుతప్పి నంది ఘాట్ లోయలకు దూసుకుపోతూ ఇద్దరు పర్యాటకులు ట్రాకింగ్ వెళ్తున్న వారిని ఢీకొంటూ లోయలోకి దూసుకుపోయి బోల్తాపడింది.

వాహనం ఢీకొన్న వారిలో ఓ అమ్మాయికి చెయ్యి విరగ్గా, రమేష్ అనే యువకుడికి వెన్నుపూస దెబ్బతిన్నట్లు వికారాబాద్ ఏరియా హాస్పిటల్ సిబ్బంది పేర్కొన్నారు. గాయాల పాలైన వారు హైదరాబాద్ షేక్పేట్ వారుగా తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement