Thursday, September 12, 2024

TS: దారుణ హత్యకు గురైన ఇద్దరు యువకులు..

ఆమనగల్లు, జూన్ 6 (ప్రభ న్యూస్) : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని బటర్ ఫ్లై సిటీలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురైన ఘటన ఇవాళ‌ ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ లో ఉంటున్న కడ్తాల్ మండలంలోని గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన గుండమోని శివ(24), శేషగారి శివ (29) అను ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుండమోని శివ హైదరాబాద్ హైటెక్ సిటీలో చికెన్ షాప్ లో పనిచేస్తుండగా, శేషగారి శివ హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు హత్యకు గురికావడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆప్రాంతమంతా మిన్నంటింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement