Tuesday, October 22, 2024

Twit – నిరాధార అరోపణలపై న్యాయపోరాటం చేస్తా – కెటిఆర్

వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసే యత్నాలు
ఆరోప‌ణ‌ల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది
మంత్రి కొండా సురేఖ దురుద్దేశపూర్వకంగా మాట్లాడారు
అందుకే 100 కోట్లకు పరువు నష్టం దావా వేశాను
ఈ వ్యాజ్యం ఇతరులకు గుణపాఠం కావాలి
వ్యక్తిగత విమర్శలకంటే ప్రజా సమస్యలకే ప్రాధాన్యం
ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేసిన కేటీఆర్​

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: నిరాధార ఆరోప‌ణ‌లు, వ్య‌క్తిగ‌త దాడులు చేసేవారిపై న్యాయ పోరాటం చేస్తాన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోష‌ల్ మీడియా ద్వారా త‌న‌ వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మంగ‌ళ‌వారం పోస్ట్ చేశారు.

ఆరోప‌ణ‌ల‌కు అదుపులేదా?

“నా పాత్రపై వ్య‌క్తిగ‌త దాడులు, నిరాధార ఆరోప‌ణ‌లు చేసేవారిపై త‌ప్ప‌కుండా పోరాటం చేస్తా. న్యాయ వ్య‌వ‌స్థ‌పై నాకు న‌మ్మ‌కం ఉంది. తప్ప‌కుండా నిజం గెలుస్తుంద‌నే విశ్వాసం కూడా ఉంది. మంత్రి కొండా సురేఖ దురుద్దేశపూరితమైన, చౌకబారు వ్యాఖ్యలకు గాను ఆమెపై ₹100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేశాను. చాలా కాలంగా నిరాధార ఆరోప‌ణ‌ల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయాయి. కొంత‌కాలంగా సోష‌ల్ మీడియా ద్వారా వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదో గుణ‌పాఠం కావాలి..

- Advertisement -

ఇక నుంచి అలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌కుండా క‌ట్ట‌డి చేయాలి. నేను ఎల్లప్పుడూ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయ విమర్శల పేరుతో చౌక‌బారు ఆరోప‌ణ‌లు చేసేవారికి ఈ వ్యాజ్యం ఒక గుణ‌పాఠం అవుతుంద‌ని అనుకుంటున్నాను” అని కేటీఆర్‌ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement