Saturday, October 26, 2024

Twit – రేవంత్ పాలనలో “నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు” : కేటీఆర్

హైదరాబాద్ – గాంధీ ఆస్పత్రి పరిస్థితులపై సీరియస్‌ అయ్యారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్. మధ్యం ధరల పెంపు పై ఉన్న మక్కువ మందు బిళ్లల పై లేకపాయే అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు.

విద్యుత్ చార్జీల పెంపు పై ఉన్న మక్కువ గాంధీలో మంచి నీళ్లపై లేకపాయే అని విమర్శలు చేశారు. మూసీపై ఉన్న మక్కువ గాంధీలో విల్ చైర్లపై లేకపాయే అన్నారు.

ఫోర్ బ్రదర్స్ సిటీపై ఉన్న మక్కువ గాంధీలో విరేచనాల మందులపై లేకపాయే… దీపావళికి బాంబులు వేయడంపై ఉన్న మక్కువ గాంధీలో రోగుల పై లేకపాయే అంటూ విమర్శించారు. అదానీ అంబుజా సిమెంట్ పై ఉన్న మక్కువ గాంధీలో బెటాడిన్ బిళ్లలపై లేకపాయే అంటూ ఆగ్రహించారు. నాడు, నేడు, ఎల్లపుడు కాంగ్రెస్ ఉందంటే నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే మాటలే వినిపిస్తాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement