Wednesday, September 18, 2024

Twit – ఈడీ మౌనం ఎవ‌రి కోసం? ప్రశ్నించిన కెటిఆర్

తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు
క‌ర్నాట‌క‌లో ₹90కోట్ల వాల్మీకి స్కామ్‌
ఇక్క‌డి కాంగ్రెస్‌ నేత‌ల‌కూ లింకులు
తొమ్మిది బ్యాంకు అకౌంట్ల‌కు ₹45 కోట్లు బ‌దిలీ
ఎన్నికల వేళ పెద్దమొత్తంలో నగదు డ్రా చేశారు
ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించిన కేటీఆర్

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. కర్నాటక వాల్మీకి స్కామ్‌తో రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని చెప్పారు. కర్నాటక ఎస్టీ కార్పొరేషన్‌ నుంచి హైదరాబాద్‌లోని తొమ్మిది బ్యాంకు అకౌంట్లకు ₹45 కోట్లు బదిలీ అయ్యాయి. అందులో వీ6 బిజినెస్‌ ఓనర్‌కు ₹4.5 కోట్లు బదిలీ అయ్యాయయని, అతడు ఎవరని నిలదీశారు.

అదే నిజ‌మైతే తెలంగాణ ప్ర‌భుత్వం కూలిపోతుంది..

- Advertisement -

లోక్‌సభ ఎన్నికల వేళ నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులు ఎవరన్నారని కేటీఆర్​ ప్రశ్నించారు. వారికి కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏంటన్నారు. వాల్మీకి స్కామ్‌కు సంబంధించి రాష్ట్రంలో సిట్‌, సీఐడీ, ఈడీ సోదాలు జరిగాయని, దర్యాప్తు సంస్థల సోదాల వార్తలు బయటకు రాకుండా అణచివేశారని అన్నారు. ₹90 కోట్లు అవినీతి జరిగిందని కర్నాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య ప్రకటించారని కేటీఆర్​ చెప్పారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలిపోతుందని కర్నాటక మంత్రి సతీశ్‌ జార్కిహోళి అన్నారు. అందులో అర్ధమేమిటి. ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా ఈడీ మౌనంగా ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు? అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement