Sunday, October 6, 2024

Twit – సిరుల గనికి మరణశాసనం – వారి మోములో చిద్విలాసం – కేటీఆర్

తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టికి బాధ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రంది లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

వాళ్లకు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని.. సింగరేణి కార్మికులపై అభిమానం లేదని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా మండిపడ్డారు. ఆ ఇద్దరికీ పట్టలేనంత సంతోషం.. మాటల్లో చెప్పలేనంత ఆనందం.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిత్రమే.. వీరి కుమ్మక్కు కుట్రలకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొంటూ ఒక ఫొటోను ట్వీట్‌ చేశారు.

- Advertisement -

వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి.. వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి.. పూలబొకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులిస్తున్నారా? అని భట్టి విక్రమార్క, కిషన్‌ రెడ్డిపై కేటీఆర్‌ మండిపడ్డారు. సిరుల గనికి మరణశాసనం రాస్తూ… చిద్విలాసమా ?? వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటమా ??? అని ప్రశ్నించారు. ఈ “వేలం” వెర్రి నిర్ణయాల నుంచి.. తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసేందుకేనా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఈ ఫిరాయింపులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరు నెలలైనా గ్యారెంటీలు అమలు చేయలేని.. అసమర్థత నుంచి తప్పించుకునేందుకేనా ఈ కుప్పిగంతులు అని నిలదీశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందన్నారు. మీ రెండు జాతీయ పార్టీలకు వేసిన ఓటు.. తెలంగాణ జాతి ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు.

సంక్షేమానికి పాతరేసి.. అభివృద్ధిని పాతాళానికి తొక్కేసి.. ఇద్దరూ ఆడుతున్న వికృతక్రీడ ఇది అని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు కంటికి రెప్పలా కాపాడిన.. తెలంగాణ సహజ సంపదను చెరబట్టినందుకు.. కాంగ్రెస్, బీజేపీలను చరిత్ర ఎప్పటికీ క్షమించదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement