Thursday, October 17, 2024

TG: మరణంలోనూ వీడని బంధం.. రోడ్డు ప్రమాదంలో ట్విన్స్ మృతి..

ఖమ్మం రూరల్, ఆగస్టు 20 (ప్రభ న్యూస్) : వారిరువురు (ట్విన్స్) కలిసే జన్మించారు… కలిసే ఇన్నాళ్లు జీవించారు… చివరకు విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో మరణంలోనూ ఇద్దరూ కలిసే మృత్యు ఒడిలోకి వెళ్ళారు… ఈ హృదయ విదారకరమైన సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది…

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రామన్నపేటకు చెందిన ఇద్దరు కవలలు (ట్విన్స్) కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి ముగ్గురు కలిసి ఖమ్మం నుంచి జక్కేపల్లి వెళ్తుండగా హైదరాబాద్ వైపు నుంచి ఖమ్మం వస్తున్న ఓ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు కవలలు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

- Advertisement -

తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను అన్నం ఫౌండేషన్ సహకారంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement