Thursday, September 5, 2024

TS – అసెంబ్లీలో బిఆర్ఎస్ తోనే ప్ర‌జాభ‌వ‌న్ కు రేవంత్ – హ‌రీష్ రావు

హైద‌రాబాద్ – అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాభవన్‌కు వెళ్లా రని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ,. ప్రజా భవన్‌కు రోజూ వెళ్తానని చెప్పిన రేవంత్.. మొదటిరోజే వెళ్లానన్నారు. తాము గత అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ఆధారాలతో సహా లేవనెత్తామన్నారు. ఈరోజు కేవలం అరగంట ముందే సమాచారం ఇచ్చి హడావుడిగా ప్రజాభవన్ కు వెళ్లారని అన్నారు. ప్రజాభవన్‌కు సీఎం వస్తారని నిన్న సమాచారం ఇస్తే.. ఈరోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లారని హరీశ్‌రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement