Saturday, October 19, 2024

Basara | అమ్మవారి సన్నిధిలో త్రిబుల్ ఐటీ ఇన్చార్జి వీసీ పూజలు

బాసర, ఆక్టోబర్ 19 (ఆంధ్ర ప్రభ) : బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని శనివారం త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ దర్శించుకొని పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, అర్చకులు సాధన స్వాగతం పలికారు.

అమ్మవారి సన్నిధిలో ఆలయ ముఖ్య అర్చకులు అచ్యుత్ మహారాజ్ ట్రిపుల్ ఐటి వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ చే ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆశీర్వచన మండపంలో ఇంచార్జ్ విసి గోవర్ధన్ అమ్మవారి శాలువాతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. వీరి వెంట యూనివర్సిటీ అధికారులు ఆలయ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement