Friday, September 6, 2024

Tragedy – భార్య, కుమార్తె హత్య …ఆపై భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ సికింద్రాబాద్ – సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్య, 10 నెలల బిడ్డను ఓ వ్యక్తి చంపాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు.

మహారాష్ట్ర నాంథేడ్‌కు చెందిన గణేశ్, స్వప్న దంపతులు. బోయిన్‌పల్లిలోని ఆర్యసమాజ్ వద్ద వీరు నివాసం ఉంటున్నారు. స్వప్న, గణేశ్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా.. 10 నెలల వయస్సున్న నక్షత్ర అనే కూతురు ఉంది. గణేశ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మూడవ కూతురు నక్షత్ర తనకు పుట్టలేదని గణేశ్‌కు అనుమానం. ఆ అనుమానంతోనే తరచుగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. అనుమానం పెనుభూతమై ఆదివారం తెల్లవారుజామున భార్య, కుమార్తెను గొంతు నులిమి చంపేసిన గణేశ్‌.. అనంతరం అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేటలో రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. తాను ఇప్ప‌టికే భార్య‌, కుమార్తెను హ‌త్య చేశాన‌ని, ఇప్ప‌డు తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement