Friday, October 4, 2024

Tragedy – కొల్తూరు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

శామీర్ పేట, అక్టోబర్ 04 (ప్రభన్యూస్): ప్రమాదశాత్తు కొల్తూరు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటన శుక్రవారం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పిల్లల మృతదేహాలను వెలికి తీశారు.

మృతులు ముదుచింతల పల్లి మండలం కొల్తూర్ గ్రామానికి చెందిన కటిక మణికంఠ (14), సలేంద్రి హర్ష (10), మనోజ్ (8) లుగా పోలిసులు గుర్తించారు. ముగ్గురు పిల్లలు 15 సంవత్సరాల లోపు వారని తెలిపారు. పిల్లల మృతితో కొల్తూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకొని జీనోమ్ వ్యాలీ పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement