Thursday, September 19, 2024

TG: గ‌ణేష్ వేడుక‌లో విషాదం… గుండెపోటుతో భ‌క్తుడి మృతి…

మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అల్కాపురి కాలేజీలో వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నాడు శ్యామ్. లడ్డూని దక్కించుకున్న తర్వాత ఆడి పాడి ఎంజాయ్ చేసిన శ్యామ్ అనంతరం మరణించాడు. 15 లక్షల రూపాయలకు లడ్డూని దక్కించుకున్న శ్యామ్ లడ్డుని తీసుకొని ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయి మృతి చెందాడు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ శామ్ ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు…విషాదంలో మునిగిపోయింది. నిన్న రాత్రి అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ లడ్డు వేలం పాటలో పాల్గొన్నాడు శామ్ ప్రసాద్. గణనాదుడి మండపం వద్ద చాలా సేపు నృత్యాలు చేశాడు శామ్. కానీ ఇంటికి వెళ్లే సరికి కుప్పకూలిన శ్యామ్‌ మృతిచెందాడు. గుండెపోటు రావడంతో మృతిచెందిన శ్యామ్ ప్రసాద్, సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement