Saturday, October 19, 2024

MDK | ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతి..

కౌడిపల్లి, అక్టోబర్ 19, ఆంధ్రప్రభ : ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలoలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే… మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన బడిగంటి సాయమ్మ (50) కిరాయి ట్రాక్టర్ తీసుకొని కౌడిపల్లిలో డస్టు ట్రాక్టర్ లో నింపుకొని వెంకటాపూర్ వెళుతుండగా.. కౌడిపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది.

ఈ ఘటనలో సాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement