Saturday, June 29, 2024

ADB: శివాజీ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి… ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

నిర్మల్ ప్రతినిధి, జూన్ 20 (ప్రభ న్యూస్) : శివాజీ స్ఫూర్తిని నేటి యువ‌త ఆద‌ర్శంగా తీసుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. హిందూ సామ్రాజ్య దినోత్సవం శివాజీ పట్టాభిశేఖ మహోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని గురువారం శివాజీ చౌక్ లోగల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ… మొఘల్ సామ్రాజ్యంను గడగడలాడించిన యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ సమితి జిల్లా అధ్యక్షులు మెడిసెమ్మ రాజు, నాయకులు అంజుకుమార్ రెడ్డి, భూమయ్య, రాంనాథ్, సత్యనారాయణ గౌడ్ , రాజేశ్వర్ రెడ్డి, ఎంసీఎన్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అరవింద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement