Friday, September 20, 2024

ADB: చేపల వేటకు వెళ్లి.. ముగ్గురు గల్లంతు..

తాంసి, (ప్రభ న్యూస్) : చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం..

మహారాష్ట్రకు చెందిన వారు తాంసి మండలంలోని బండల్ నాగపూర్ గ్రామంలో గల బంధువుల ఇంటికి వచ్చి సరదాగా మంగళవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చర వాగులో ముగ్గురు యువకులు చేపల వేటకు వెళ్లగా వాగులో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement