Friday, September 20, 2024

RR: రాఘవేంద్రపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి… ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్, ఆగస్టు 20 ( ప్రభ న్యూస్): పూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు రాఘవేంద్రపై దాడి చేసిన అధికార పార్టీకి చెందిన కడుమూరు ఆనందంపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డికి మెమోరాండం సమర్పించారు.

మంగళవారం వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాధవరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందరెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశం పటేల్, మండల పార్టీ అధ్యక్షుడు రాఘవేంద్రతో కలిసి ఆయన ఎస్పీ నారాయణరెడ్డిని కలిశారు. ఈసందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిపై దాడి శోచనీయమన్నారు. వెంటనే కడుమూరు ఆనందం పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement