Friday, September 6, 2024

TG: భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ..

భద్రాచలం, జులై 27 (ప్రభ న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి నేటి ఉదయం 11 గంటలకు 52.0 అడుగులకు చేరుకుంది. అప్ప‌టి వ‌ర‌కు మూడో ప్రమాద హెచ్చరికకు అడుగు దూరంలోనే ఉండగా… భద్రాచలం ద‌గ్గ‌ర వ‌ర‌ద పెరగడంతో 53 అడుగులకు చేరుకుంది. దీంతో కాసేపటి క్రితం మూడో ప్ర‌మాద హెచ్చరిక జారీ చేశారు.

భద్రాచలంలోని పట్టణ సరిహద్దులో ఉన్న ఏఎంసీ కాలనీలోనికి వరద నీరు చేరింది. పట్టణ బ్యాక్ వాటర్, ఆంధ్ర – తెలంగాణ సరిహద్దులో ఉన్న స్లూయిజ్ పనిచేయకపోవడంతో పట్టణంలోని బ్యాక్ వాటర్ గోదావరిలోనికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కాలనీలోకి మురుగునీరు వెనుకకు పారుతుంది. దీంతో సుమారు 30 ఇల్లు ముంపునకు గురైనాయి.

ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఇదే క్రమంలో పర్ణశాల సబ్ స్టేషన్ వద్ద రోడ్ పైకి, దుమ్ముగూడెం మండలం తూరుబాక బ్రిడ్జి దగ్గర రోడ్డు పైకి గోదావరి వరద నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లో అంతరాయం కలిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement