Friday, September 20, 2024

WGL: బస్వాపూర్ లో దొంగల బీభత్సం.. దంపతులపై దాడి..

రూ.లక్ష నగదు, బంగారం, బైక్ చోరీ
కాటారం, ఆగస్టు 29 (ప్రభ న్యూస్) : భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ‌త‌ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేశారు. తమకు అడ్డు తగులుతున్నారని ఇంట్లో భర్త తిరుపతిని కట్టేసి ఆయన భార్య స్వర్ణలత గొంతు కోశారు.

ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదు, ఐదు తులాల బంగారం, బైకును అపహరించారు. తీవ్రగాయాల పాలైన స్వర్ణలత భూపాలపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు బస్వాపూర్ గ్రామాన్ని సందర్శించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనతో స్థానికంగా ఆందోళన చోటుచేసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement