Wednesday, October 2, 2024

TG: మరచిపోలేని మహానేత వైఎస్ఆర్ : నీలం మధు ముదిరాజ్..

ఉమ్మడి మెదక్ బ్యూరో : సంక్షేమంలో తనకు తానే సాటి అంటూ ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించిన మరిచిపోలేని మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలో ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. సంక్షేమ సారధిగా ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు. రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టడంతో పాటు ఒకే దఫా రుణమాఫీ చేయడమే కాకుండా సాగునీటి రంగాన్ని బలోపేతం చేశారన్నారు.

ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించారన్నారు. పేద విద్యార్థులకు ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ ప్రవేశపెట్టి ఉన్నత విద్య కలను సాకారం చేశారన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నేటికి కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement