Friday, October 18, 2024

TS: ప్రొ.జయశంకర్‌ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి : ఈటెల రాజేంద‌ర్

ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్, జూన్ 21: ప్రొ.జయశంకర్‌ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని మల్కాజిగిరి ఎం.పీ ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా, అల్వాల్ లో ఆయన విగ్రహానికి మల్కాజిగిరి ఎం.పీ ఈటల రాజేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ… తెలంగాణ ప్రొ.జయశంకర్ జాతి గర్వించదగిన బిడ్డ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఆయ‌న‌ వర్ధంతిని తెలంగాణ యావత్ ప్రజానీకం ఈరోజు ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

మూడు తరాల ఉద్యమానికి సజీవ సాక్షి ప్రొ.జయశంకర్ సార్ అని, 1952 లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారన్నారు. అలాగే 1969 లో ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కి సలహాలు సూచనలు అందించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పడంలో వారు పోషించిన పాత్ర అనిర్వచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే జీవించి, మరణించారన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం ప్రజలంతా పునరంకితం కావాలని, ప్రతి తెలంగాణ బిడ్డకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నానని ఈటెల రాజేందర్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement