Monday, October 21, 2024

TG | పోలీసుల త్యాగం మరువలేనిది.. సీపీ అభిషేక్ మహంతి

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవ లేనివని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలియజేశారు. సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రం పోలీస్ హెడ్ క్వార్టర్లోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ ఆర్మూర్ ఫోర్సెస్ వందన సమర్పణ చేశారు. అనంతరం జిల్లాలోని ఉన్నతాధికారులు, అధికారులు పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు పెట్టి నివాళులర్పించారు.

అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి మాట్లాడుతూ… పోలీసుల త్యాగం మరువలేనిదని అలనాడు వారు చేసిన త్యాగాలే ఈరోజు మనమంతా ప్రశాంత వాతావరణంలో ఉన్నామని, స్టేట్ పోలీస్ సెంట్రల్ ఫోర్సెస్ ప్రాణ త్యాగాలు ఆయన గత స్మృతులను గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యే ఏకైక డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు అమరులైన కుటుంబాల తో కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి మాట్లాడి వారి సేవలను కొనియాడారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement