Saturday, October 19, 2024

TG | వాళ్లే ఆక్ర‌మ‌ణ‌దారులు.. అందుకే భ‌య‌ప‌డుతున్నారు… రేవంత్

హైదరాబాద్: హైడ్రా అన‌గానే కేటీఆర్, హ‌రీశ్ రావు, ఈట‌ల బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని.. ఆక్ర‌మ‌ణ‌దారులే హైడ్రాను చూసి భ‌య‌ప‌డుతున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

“హైడ్రాను చూపి రియల్ ఎస్టేట్ ను దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారు. అజీజ్ న‌గర్ హరీశ్ రావుకు ఫాంహౌస్ లేదా ? గతంలో కాంగ్రెస్ వల్లనే హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చింది. కేసీఆర్ కుటుంబానికి దోపిడీ చరిత్ర ఉంది. తెలంగాణ ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారు ” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement