Friday, October 18, 2024

KHM: కారులో చెలరేగిన మంటలు… భార్య, భర్తలకు గాయాలు

మణుగూరు, జులై 22 (ప్రభ న్యూస్): కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మణుగూరు సింగరేణి ఉద్యోగి రామ్మోహన్, జోష్నరాణి భార్య భర్తలు తమ కారులో ఊరికి వెళ్తున్నారు.

ముత్యాలమ్మ నగర్ వద్ద కారులో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి వారిని కాపాడారు. ఈ ప్రమాదంలో భార్య భర్తలకు గాయాలు అవడంతో సింగరేణి అస్పత్రికి వైద్యం కోసం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మణుగూరు ఎస్.ఐ రంజిత్ ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement