Friday, October 18, 2024

HYD: రెచ్చిపోయిన దోపిడీ గ్యాంగ్.. ఎక్సైజ్ పోలీసులపై దాడి

హైదరాబాద్ నగరంలోని మైలార్ దేవ్ పల్లిలో దోపిడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. జల్ పల్లి దగ్గర దోపిడీ గ్యాంగ్ ఎక్సైజ్ పోలీసులపై దాడికి పాల్పడింది. గంజాయి ఉందన్న అనుమానంతో పోలీసులు బైక్ ను నిలిపివేశారు.

దీంతో బైక్ పై ఉన్న దోపిడీ దొంగలు పెప్పర్ స్ప్రే కొట్టి పరారయ్యారు. అయితే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారి నుంచి బైకు, నకిలీ తుపాకీతో పాటు రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement