Wednesday, October 2, 2024

TG | కనువిందు చేసిన ప్రకృతి మేఘాలు!

జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ప్రకృతి మేఘాలు కనులకు ఇంపుగా కనిపించాయి. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో మేఘాలు కమ్ముకుని వీక్షకులకు కనువిందు చేశాయి. ఇలా ఆకాశంలో మబ్బులు క‌మ్ముకోవ‌డంతో ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఎటు చూసినా ప్రకృతి మబ్బులతో వింతగా కనిపిస్తోంది. మండల కేంద్రంలోని నాలుగు వైపులా చూస్తే పచ్చని చెట్లు, మబ్బుల ఆకారంతో ఆకాశం ఎంతో అందంగా కనిపించింది. ప్రకృతి మేఘాలను చూసి పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కనుల విందు దృశ్యాన్ని ఫోన్లు, కెమెరాలతో ఫోటోల రూపంలో బంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement