Friday, October 18, 2024

TG Assembly | తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. అసెంబ్లీలో సీఎం ఆగ్ర‌హం

  • ప్రజలు శిక్షించినా.. బీఆర్ఎస్ నేతలు మార‌ట్లేదన్న సీఎం రేవంత్
  • దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని మాత్రమే ప్రార్థించగలం
  • తండాలలో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి

తెలంగాణ‌పై కేంద్రం వివ‌క్ష చూపింద‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ స‌మావేశాల రెండో రోజు బుధ‌వారం ఆయ‌న అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్రం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌.. ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సీఎం గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించుగాక అని మాత్రమే ప్రార్థించగలమన్నారు. కాగా, కేంద్ర బ‌డ్జెట్‌ని ప్ర‌స్తావిస్తూ.. తెలంగాణ‌కు నిధులు కేటాయించ‌లేద‌ని, దీనికి కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

తండాల‌కు రోడ్లే లేవు..

పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదని సీఎం రేవంత్ అన్నారు.. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని తెలిపారు. తండాలకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల ఇళ్లకు తాగు నీరు ఇవ్వలేదని ఆరోపించారు. తండాలకు 100 శాతం రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి అన్నారు.

జాబ్ క్యాలెండ‌ర్‌, న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల‌పై బీఆర్ఎస్..

కాగా, అంతకుముందు నిరుద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానం కోరుతూ బీఆర్ఎస్ నోటీసు ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటనతోపాటు ఇతర న్యాయ పరమైన డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి, నిరుద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వ అణచివేత వైఖరిపై చర్చ చేపట్టాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు కేటీఆర్‌ ఈ నోటీసు ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement