Wednesday, July 3, 2024

ADB: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

ఆంధ్రప్రభ ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్ నగర్ కాలనీలో మమత జిన్నింగ్ మిల్ వద్ద రోడ్డు ప్రక్కన రక్త గాయాలతో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గురువారం ఉదయం పోలీసులు కనుగొన్నారు. మృతురాలు దాదాపు 30 సంవ‌త్స‌రాల‌ వయసుతో ఎరుపు రంగు ఆనవాళ్ళతో గులాబీ రంగు చీర, జాకెట్ ధరించి ఉందని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.


మహిళను ఎక్కడో గాయపరిచి, చంపి సంఘటన స్థలంలో పడేసినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు.. మహిళ ముఖంపై, ఒంటిపై గాయాలు ఉండడంతో ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, ఈ విషయంపై సంబంధికులు, ప్రజలు ఎవరైనా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి నెంబర్ 8712659914, ఆదిలాబాద్ రెండవ పట్టణ సీఐ అశోక్ నెంబర్ 8712659920 కు సంప్రదించగలన్నారు. మహిళ మృతదేహం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఉంచినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement