Tuesday, September 17, 2024

MBNR: బైక్ అదుపుతప్పి.. యువకుడు మృతి..

మహిళకు తీవ్ర గాయాలు..
ఊట్కూర్, ఆగస్టు 8 (ప్రభ న్యూస్) : ఆస్ప‌త్రికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కింద‌ప‌డ‌డంతో యువకుడు మృతి చెందగా, మృతుని చిన్నమ్మకు తీవ్ర గాయాలైన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్ పల్లి సమీపంలో ఇవాళ‌ చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… ఊట్కూర్ మండల పరిధిలోని యర్గట్ పల్లి గ్రామానికి చెందిన చాపలి అభిషేక్ (18) తన చిన్నమ్మను పాముకాటు చికిత్స నిమిత్తం నారాయణపేట ఆస్ప‌త్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నాడు.

ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్ పల్లి, సింగారం గ్రామ సమీపంలో రహదారిపై ఎద్దులు రావడంతో వాటిని తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అభిషేక్ తలకు తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగులోనే మృతిచెందాడు. అటువైపు వెళుతున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన సుజాతను నారాయణపేట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్సల కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement