Friday, October 18, 2024

WGL: యువకుడి ప్రాణాలు తీసిన చెట్టు…

బైక్ చెట్టును ఢీకొట్టి యువకుడు మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వాజేడు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన యాలం భూపతిరావు (32) తాడ్వాయి మండలం బీరెల్లి- కాటాపూర్ రోడ్డు బంజర వద్ద పడి ఉన్న చెట్టుకు ఢీ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు.

వివరాలు తెలుసుకున్న స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తన పోలీస్ బలగాలతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి సమాచారం సేకరిస్తున్నారు.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement