Friday, September 20, 2024

TG: యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం.. మంత్రి శ్రీధర్‌ బాబు

మంథని, ఆంధ్రప్రభ : యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గిట్లస్‌ హబ్‌ వద్ద హైదరాబాద్‌కు చెందిన సెంటిలియన్‌ నెట్‌వర్క్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఐటీ పరిశ్రమల స్థాపనతో మంథని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, ఉన్నత విద్యనభ్యసించి సాఫ్ట్‌ వేర్‌ రంగంలో రాణించేలా విద్యార్థులు, యువతకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈకార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement