Friday, September 6, 2024

TG: మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం.. మంత్రులు

ఓదెల, ఆంధ్ర ప్రభ : నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు తెలిపారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కోలనూరులో ఒక కోటి 56 లక్షల రూపాయ‌ల‌తో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో వైద్య వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచామని, గతంలో కంటే అధిక శస్త్ర చికిత్సలు, వ్యాధులను పొందుపరిచామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసుతో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement