Saturday, October 19, 2024

KNR | ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపెల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా నియమించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చైర్మన్ అన్నయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్సింగ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి వెళ్ళి సీఎంకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రావు, ఊట్ల వరప్రసాద్, నగునూరి అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement