Friday, October 18, 2024

TGSRTC | టికెట్ ధరలపై సజ్జనార్‌ క్లారిటీ !

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : బతుకమ్మ, దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో విపరీతంగా టికెట్ల ధరలు పెంచారనే ఆరోపణలు అవాస్తవమని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ఈక్రమంలో ఆర్టీసీ బస్సులలో టికెట్స్‌ రేట్లు పెంచడం అవాస్తవం అంటూ వివరణ ఇచ్చారు.

2003లో వచ్చిన జీవో 16 ప్రకారమే స్పెషల్‌ బస్సుల్లో మాత్రమే చార్జీలను సవరించామని పేర్కొన్నారు. రెగ్యులర్‌ సర్వీసుల టికెట్స్‌లో ఎలాంటి పెంపు లేదని వెల్లడించారు. పండగ సమయాల్లో స్పెషల్‌ బస్సుల డీజీల్‌ ఖర్చుల మేరకు రేట్లు సవరించుకోవచ్చని, ఆ మేరకు కేవలం స్పెషల్‌ బస్సుల్లో మాత్రమే కొంతమేర పెంచామన్నారు.

రాష్ట్రంలోని 8500 రెగ్యులర్‌ సర్వీసుల్లోని టికెట్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని, కేవలం దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నడిపే 500 సర్వీసుల్లో మాత్రమే చార్జీల పెంపు ఉందని ప్రయాణికులు గమనించాలని కోరారు. కొందరు కావాలనే సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆర్టీసీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement