Sunday, October 6, 2024

TG | తిరుమల తరహాలో యాదాద్రి.. స్వామివారి దర్శణానికి ఏర్పాట్లు

తిరుమల దేవస్థానం తరహాలో భక్తులకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభువుల దర్శనం కలగనుంది. దర్శనానికి యాదాద్రికి వచ్చే భక్తులు ఆలయంలోని మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకొంటూ.. గర్భగుడి చెంతకు చేరుకునేలా క్యూ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్‌ రావు వెల్లడించారు. ఈ నెల 10 నుంచి ప్రయోగాత్మకంగా అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇక ఆలయానికి వచ్చే దివ్యాంగులకు పశ్చిమ గోపురం నుంచి నేరుగా యాదాద్రీశుడి దైవదర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement